స్థాయి మరిచి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు

– కోట్లు పెట్టి ఓట్లు కొనుక్కుని నక్క నీతులా?
– విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
రెండు కోట్లు పెట్టుబడితో మండల పరిషత్ అధ్యక్షపదవి కొనుక్కున్నాను అని చెప్పిన ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ మూర్తి సీఎం రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేయడం స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవ రావు మండిపడ్డారు. సోమవారం కాంగ్రెస్ ముఖ్యనాయకులు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చెన్నకేశవరావు తో పాటు మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఎస్.కే పాషా, తుమ్మ రాంబాబు,జ్యేష్ఠ సత్యనారాయణ చౌదరి మాట్లాడారు. గత ప్రభుత్వం నియంత పాలన సాగించింది అని,రైతు బంధు పధకం మాటున భూస్వాములకు ప్రజాధనం పంచారు అనీ, దళిత బంధు తో బీఆర్ఎస్ కార్యకర్తలు లక్షాధికారులు అయ్యారని,కమీషన్ ల కక్కుర్తి తో ప్రాజెక్టులు నాశిక్ రకంగా నిర్మించారని ఎద్దేవా చేసారు. పార్టీ కోలుకోలేని పరిస్థితి నేపధ్యం నాయకులు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో బండారు మహేష్ లు పాల్గొన్నారు.
Spread the love