తైవాన్లో భూకంపం..కుప్పకూలిన భవనాలు..

నవతెలంగాణ – హైదరాబాద్: తైవాన్ ద్వీపాన్ని భూకంపం వణికిస్తోంది. తాజాగా తైవాన్లో సోమవారం (ఏప్రిల్23) భూకంపం సంభవించింది. తైవాన్లోని తూర్పు కౌంటీ హువాలియన్ లో 5.5 తీవ్రతతో భూమి కంపించిందని తైపీ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ యొక్క సీస్మోలజీ సెంటర్ తెలిపింది. భూకంపం ధాటికి తైవాన్ రాజధాని తైపీలో భవనాలు కుప్పకూలాయి. భూకంపం 10 కి.మీ ల లోతులో సంభవించినట్లు తైవాన్ సిస్మోలజీ సెంటర్ తెలిపింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే రెండు సార్లు భూకంపం రావడంతో తైవాన్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈనెల( ఏప్రిల్ నెలలో)లో తైవాన్లో భూకంపం రావడం ఇది రెండోసారి. ఏప్రిల్ 03 న హువాలియన్ లో రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. 14 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. వందల సార్లు భూమి కంపించింది.

Spread the love