సజ్జల రామకృష్ణ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్

నవతెలంగాణ – హైదరాబాద్: వైసీపీ, తెలుగుదేశం పార్టీ మధ్య ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది .ఒక పార్టీపై మరో పార్టీ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తున్నాయి. దీంతో ఎన్నికల సంఘం విచారణకు ఆదేశిస్తోంది.అలాగే సీఐడీని రంగంలోకి దింపుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేశారని వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.దీంతో సీఐడీ విచారణకు ఈసీ అధికారులు ఆదేశాలు జారీ చేసింది. దీంతో టిడిపి నేతలపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి, సజ్జల రామకృష్ణ తనయుడు భార్గవ రెడ్డిపై ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబునే కారణమని ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ఐవీఆర్ఎస్ ద్వారా ఓటర్లు, పింఛన్ దారులను తప్పుదోవ పట్టించారని,వైసీపీ సోషల్ మీడియా ద్వారా విద్వేషాలు రగిల్చేలా తప్పుడు ప్రచారం చేశారని, సజ్జల భార్గవ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. వర్ల ఫిర్యాదు మేరకు ఐవీఆర్ఎస్ కాల్స్‌పై సీఐడీ దర్యాప్తునకు ఈసీ ఆదేశించింది. విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సీఐడీ డీజీకి ఆదేశాలు జారీ చేసింది.

Spread the love