రాష్ట్ర సైనిక్ పాఠశాలకు తవక్లాపూర్ పాఠశాల విద్యార్థి ఎంపిక 

నవతెలంగాణ – డిండి
మార్చి 10వ తేదీన నిర్వహించిన రాష్ట్ర సైనిక పాఠశాల ఇంటర్వూ పరీక్షల్లో డిండి మండలం తవక్లాపురం మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థి ఎంపికయ్యారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. గ్రామానికి చెందిన కిన్నెర శివకుమార్ కుమారుడు నవీన్ మార్చ్ 10న నిర్వహించిన రాష్ట్ర సైనిక స్కూల్ ప్రవేశ పరీక్షల్లో 1:10 ఎంపికయ్యాడు. మార్చి 22న నిర్వహించిన సైనిక్ పాఠశాల ఈవెంట్స్ ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డిస్ర్కిప్టివ్ టెస్టులలో ప్రతిభ కనబరిచి కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ సైనిక్ పాఠశాలలో ఎంపికైనట్లు ఆయన తెలిపారు. విద్యార్థి సైనిక పాఠశాలలో ప్రతిభ కనబరిచినందుకు తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తండ్రి కిన్నెర శివకుమార్, పాఠశాల ఉపాధ్యాయులు నవీన్, వెంకటేష్, రేణుక తదితరులు పాల్గొన్నారు.
Spread the love