ఉరుములు మెరుపులతో వాన.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం బారీ వర్షాలు కురుస్తున్నాయి. జనగామ జిల్లాలో ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో కూడిన వర్షం పడ్తోంది. రఘునాథ పెళ్లి మండలం కోడూరులో పిడుగు పడి దాసరి అజయ్ అనే 23  యువకుడు చనిపోయాడు. అక్కడ ఉన్న యువకుడి తల్లి రేణుక తృటితో తప్పించుకుంది. పిడుగుపాటులో  అజయ్ తో సహా రెండు గేదెలు కూడా చనిపోయాయి. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో వడగళ్ల వాన పడ్తోంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓడగూడెంలో పిడుగు పాటుకు బాస బుల్లోడు (46)అనే రైతు మృతి చెందాడు. నల్గొండ, ములుగు జిల్లాల్లో కూడా బారీ వర్షాలు కురుస్తున్నాయి.

Spread the love