– వందేభారత్ ఎక్స్ప్రెస్తో ట్రోఫీ టూర్
న్యూఢిల్లీ : వెటరన్ క్రికెటర్లు పోటీపడే లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్ నవంబర్ 8న ఆరంభం కానుంది. డిసెంబర్ 9న టైటిల్పోరుతో ముగియనున్న ఈ లీగ్.. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లతో ట్రోఫీ టూర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా బుధవారం నుంచి 15 రోజుల పాటు 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో లెజెండ్స్ లీగ్ ట్రోఫీని అభిమానుల కోసం ప్రదర్వనకు ఉంచనున్నారు. ఈ సీజన్ మ్యాచులకు డెహ్రాడూన్, జమ్ము, వైజాగ్, సూరత్ నగరాల్లో వేదిక కానుండగా.. టైటిల్ కోసం ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, గుజరాత్ జెయింట్స్, అర్బన్ రైజర్స్ హైదరాబాద్, సదరన్ సూపర్ స్టార్స్, బిల్వారా కింగ్స్ పోటీపడనున్నాయి. ఈ మేరకు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.