సీపీఐ(ఎం) అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి గెలిపించండి

నవతెలంగాణ – చండూరు

సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి దోనూరు నర్సిరెడ్డిని గెలిపించాలని కేంద్ర కమిటీ సభ్యులు చేరిపల్లి సీతారాములు అన్నారు. శుక్రవారం తన రెండో నామినేషన్ సెట్టును  ఎన్నికల అధికారి దామోదర్ రావు కు అందజేశారు. సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 19 నియోజకవర్గాల్లో సిపిఎం బరిలో ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చెందాల్సిన పకృతి  సంపదను పెట్టుబడుదారులకు చౌక ధరల్లో కట్టబెట్టిందని, పెట్టుబడుదారులు యథేచ్చగా ధరలు అధికంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుగాంచిన నల్లగొండ ను ఎర్రగొండ గా చెప్పుకునే విధంగా మహనీయులు చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టుల బలం నిరూపించుకునే సమయం ఆసన్నమైందని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్లీ ఎర్రజెండా రాజ్యం కోసం సిపిఎం ప్రకటించిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త ప్రత్యర్ధులకు దీటుగా గెలుపు కోసం పని చేయాలని కార్యకర్తలకు సూచించారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, ధనుంజయ గౌడ్, మొదల వెంకటేశం , చాపల రాములు తదితరులు పాల్గొన్నారు.
Spread the love