ప్రతి ఒక్కరం ఓటు హక్కును వినియోగించుకుందాం!

నవతెలంగాణ – రామారెడ్డి
 ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని, 100% పోలింగ్ అయ్యేవిధంగా కృషి చేయవలసిన బాధ్యత అందరిపై ఉందని, శుక్రవారం ఇన్స్ ఫైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ ద్వారా మండల కేంద్రంలో భైరవ గ్రామ మహిళా సంఘం సభ్యులకు స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి అమృత రాజేందర్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఓటు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, పవిత్రమైనదని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఓటు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా పవిత్రంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపిఎం ప్రసన్న కుమార్, సిబ్బంది ప్రవీణ్ రెడ్డి, శివాజీ రావు, సీసీ ప్రతాప్, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love