ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, గంగలోర్ పిఎస్ పరిధిలోని పిడియా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. పిడియా అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నేతలు సమావేశం అయ్యారనే ఖచ్చితమైన సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది. అలాగే మృతి చెందిన మావోయిస్టులలో ఆ పార్టీ అగ్ర నేతలు ఉన్నట్లుగా సమాచారం. పూర్తి వివరాలు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించాల్సి ఉంది.

Spread the love