ప్రశ్నించే గొంతుక జహంగీర్ ను పార్లమెంటుకు పంపుదాం: మల్లు నాగార్జునరెడ్డి

నవతెలంగాణ – నూతనకల్
ప్రజా గొంతుక ఎండీ జహంగీర్ ను  పార్లమెంట్ కు పంపుదాం అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ఆదివారం మండల పరిధిలోని ఎడవెల్లిలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి గాజుల జానయ్య అధ్యక్షతన నిర్వహించిన గ్రామ శాఖ జనరల్ బాడీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. పార్లమెంటులో, కార్మిక, కర్షక, విద్యార్థిని ఉద్యోగుల సమస్యలపై పోరాడే అందుకు సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలని వారు కోరారు. కమ్యూనిస్టుల కంచుకోట అయిన భువనగిరి నియోజకవర్గం లో నాటి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు దండ వెంకటరెడ్డి గ్రామ శాఖ నాయకులు ఎల్లయ్య భద్రయ్య లింగయ్య లక్ష్మమ్మ రాములమ్మ తదితరులు  పాల్గొన్నారు.
Spread the love