బాలుడిని మింగేసిన మొసలిని కొట్టి చంపిన స్థానికులు

నవతెలంగాణ – బీహార్
నదిలో స్నానం చేస్తున్న ఓ 14 ఏళ్ల బాలుడిని మింగేసిన మొసలిని కుటుంబ సభ్యులు చంపేశారు. బీహార్ రాష్ట్రం వైశాలీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాఘోపూర్ దియారా గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇటీవల కొత్త బైక్ కొనుగోలు చేసింది. కొత్త బైక్ కు పూజ చేయించాలనుకున్నారు. పూజకు అవసరమైన పవిత్రమైన గంగాజలం కోసం నది వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో జలం కోసం అమిత్ కుమార్ (14) గంగానదిలోకి దిగాడు. ముందుగా నదిలో స్నానం చేస్తుండగా ఓ భారీ మొసలి బాలుడిపై ఒక్కసారిగా దాడి చేసింది. అనంతరం బాలుడిని అతడి కుటుంబ సభ్యుల ముందే అమాంతం మింగేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు.. స్థానికుల సాయంతో మొసలిని నదిలో నుంచి బయటకు లాగారు. రాళ్లు, రాడ్లు, కర్రలతో ఆ మొసలిని కొట్టి చంపేశారు.

Spread the love