- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మార్కపురం జిల్లా కంభంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహానికి వెళ్తున్న బంధువులు ఆలయం వద్ద ఆటోలో ఉండగా, అతివేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నాలుగేళ్ల బాలికతో సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
- Advertisement -



