కాంగ్రెస్ గెలుపు తథ్యం.. మెజార్టీయే లక్ష్యం

– పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
నవతెలంగాణ – పెద్దవంగర
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని, భారీ మెజార్టీ లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఏవైనా గెలుపు కాంగ్రెస్ పార్టీ దేనని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండలం నుండి కాంగ్రెస్ కు పదివేల మెజార్టీ తీసుకురావాలన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, సీనియర్ నాయకులు నిరంజన్ రెడ్డి, నెహ్రు నాయక్, ప్రవీణ్ రావు, ఉపాధ్యక్షుడు మురళి, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, వేణు, యూత్ అధ్యక్షుడు హరికృష్ణ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సమ్మయ్య, వివిధ గ్రామ పార్టీల అధ్యక్షులు, మండల పార్టీ ముఖ్యనాయకులు తదితరులు, పాల్గొన్నారు.
Spread the love