క్రీడా నైపుణ్యం పెంపొందించుకోవాలి: రావుల వెంకట రంగారెడ్డి

– క్రికెట్ క్రీడాకారులకు జెర్సీ లు పంపిణీ 
నవతెలంగాణ – పెద్దవంగర
యువత క్రీడ నైపుణ్యం పెంపొందించుకోవాలని రావుల వెంకట రంగారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన క్రికెట్ క్రీడాకారులకు ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి జ్ఞాపకార్థం క్రికెట్ జెర్సీ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టిన గడ్డ గర్వపడేలా క్రీడాకారులు ఎదగాలన్నారు. క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలని, గెలుపు ఓటములను  సమానంగా స్వీకరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు పాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మొగలగాని సోమల్లు, గ్రామ యూత్ అధ్యక్షుడు మొగలగాని రజనీకాంత్, కందుల యాకయ్య, గ్రామ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రామ్ చరణ్ తేజ్, యూత్ నాయకులు అనపురం ఉపేందర్, సుధీర్, మొగలగాని శ్రీకాంత్, ఎండీ రియాజ్, అనపురం రాకేష్, మొగలగాని సుమంత్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love