![](https://navatelangana.com/wp-content/uploads/2023/11/brs-6.jpg)
నవతెలంగాణ-నసురుల్లాబాద్
బాన్సువాడ ఎమ్మెల్యేగా ఆయనను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి భార్య మంజుల కోరారు. సోమవారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని నందు పటేల్ నివాసంలో గ్రామ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామ మహిళలతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వివరించారు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అలాగే బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. .ఈ సందర్భంగా అభ్యర్థి సతీమణి మంజుల మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని, ఆరు గ్యారెంటీ ల ను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నందు పటేల్, యూసుఫ్, మాజీ ఎంపీటీసీ శంకర్, సర్పంచులు అరిగే సాయిలు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.