Tuesday, July 28, 2026
E-PAPER
Homeఖమ్మంఏఐటీయూసీ జిల్లా 17వ మహాసభలను జయప్రదం చేయండి 

ఏఐటీయూసీ జిల్లా 17వ మహాసభలను జయప్రదం చేయండి 

- Advertisement -

– ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా కరపత్రాల ఆవిష్కరణ 
నవతెలంగాణ-సత్తుపల్లి

ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా 17వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ మహాసభల ఆహ్వాన సంఘ కమిటీ నాయకులు దండు ఆదినారాయణ, నిమ్మటూరి రామకృష్ణ కోరారు. మంగళవారం మహాసభల కరపత్రాలను ఆహ్వానసంఘ  గౌరవాధ్యక్షురాలు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా మంగళవారం స్థానిక లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాలులో  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడారు. ​కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, వారి సమస్యలపై నిరంతరం పోరాడే సంఘం ఏఐటీయూసీ అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ​

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక కోడ్‌లకు వ్యతిరేకంగా పోరాడాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఆగస్టు 23, 24 తేదీలలో సత్తుపల్లి వేదికగా ఏఐటీయూసీ జిల్లా మహాసభలు ఘనంగా జరగనున్నాయని ఆదినారాయణ, రామకృష్ణ తెలిపారు. ​​ఏఐటీయూసీ ఆవిర్భవించిన తర్వాత సత్తుపల్లిలో ప్రథమంగా జిల్లా మహాసభలు నిర్వహించడం గర్వకారణమని వారన్నారు. ​రాబోయే రోజుల్లో కార్మికుల హక్కుల రక్షణ కోసం భవిష్యత్ పోరాటాల కార్యాచరణను ఈ మహాసభల్లో రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. సత్తుపల్లి, పరిసర ప్రాంతాల ప్రజలు, కార్మికులు ఈ మహాసభలకు పూర్తి సహకారాన్నిందించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

​ఈ కార్యక్రమంలో మహాసభల చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్,  సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, ఆహ్వాన సంఘం కోశాధికారి తడికమళ్ల యోబు, గాదె చెన్నకేశవరావు, బీసీ సంఘం నాయకులు, డీసీసీబీ డైరెక్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -