అభినందన సభను విజయవంతం చేయండి

నవతెలంగాణ- భీంగల్: భీంగల్ పట్టణ కేంద్రానికి చెందిన డాక్టర్ మధు శేఖర్  32 సంవత్సరాలుగా వైద్య సేవలు చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా అందజేసిన స్వచ్ఛంద కార్యక్రమాలకు గాను సీఎం కేసీఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ గా నియమించిన సందర్భంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో నిర్వహించే అభినందన సభను విజయవంతం చేయాలని దళిత ఐక్య సంఘటన మండల అధ్యక్షుడు గడాల ప్రసాద్  పిలుపునిచ్చారు ఈ మేరకు పట్టణ కేంద్రంలో  విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ఈ  కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గం లోని  8 మండలాల దళిత సంఘాల నాయకులు దళితులు పాల్గొని కార్యక్రమానికి విజయవంతం  చేయాలని, ముఖ్యఅతిథిగా ఎర్రోళ్ల శ్రీనివాస్, మల్లెపల్లి లక్ష్మయ్య, తెలంగాణ ఉన్నంత మండలి చైర్మన్ లింబాద్రి, రెంజర్ల  రాజేష్  హాజరుకానున్నట్లు వారు తెలిపారు. ఈ   సమావేశంలో దళిత సంఘం మాజీ అధ్యక్షుడు పర్స నవీన్, ఉపాధ్యక్షుడు భీమ్ రవీందర, మేకల శ్రీనివాస్, కార్యదర్శిలు, యోనా, బద్దం సంపత్, చింతలూరి అవినాష్, సుశాంత్, భూమన్న, సంతోష్, పర్స జయంత్, సుమన్, చింతలూరి సుజన్, భాగేష్, మొండి ప్రశాంత్, దళిత నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love