యువ గర్జన సభను విజయవంతం చేయండి..

నవతెలంగాణ – వేములవాడ:
బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో ఈనెల 6న వేములవాడ పట్టణంలో నిర్వహించనున్న  యువ గర్జన సమ్మేళనానికి నియోజకవర్గంలోని విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు  పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం వేములవాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యువ గర్జన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువగర్జన సమ్మేళనానికి పార్టీ వర్కింగ్, ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నాడని, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  సూచించారు. ఈ సమావేశంలో యువజన విభాగం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఈర్లపల్లి రాజు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, గోలి మహేష్, నిమ్మశెట్టి విజయ్, గుండెకారుల నరేష్, మంద రాజేందర్ వనపట్ల సందీప్ రెడ్డి, పోతు అనిల్, చెట్టిపెల్లి నరేష్, వంగ ప్రవీణ్, పసుల అంజి, కొడగంటి శ్యాం, బత్తుల మహేందర్ యాదవ్, కాసర్ల అరుణ్, మంద శేఖర్ గబ్బర్ సింగ్, నీరటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love