సంబరాలలో మండల కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ – నిజాంసాగర్

ఉమ్మడి మండల కేంద్రంలోని మహమ్మద్ నగర్ లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు మండలంలోని నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లయ్య గారి ఆకాష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని ఇకపై బిఆర్ఎస్ నాయకుల అవినీతిని వెలికి తీయడమే మా పని అని ఆయన అన్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం 6 గ్యారంటీ లపై సంతకం చేశారని ఆయన అన్నారు. ఇకపై రాష్ట్రం మొత్తం అందరికీ సమపాలన అందించడమే మా లక్ష్యం అని అయన అన్నర్. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు లోక్య నాయక్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Spread the love