ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బండిపొరా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు చనిపోయాడు. బండిపొరా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇరుపక్షాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని బస్తర్‌ ఐజీ పీ సుందర్రాజ్‌ తెలిపారు. ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిల్‌ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నదని వెల్లడించారు. మృతుడిని గుర్తించాల్సి ఉందన్నారు.

Spread the love