ఛత్తీస్‌గఢ్ లో పోలీసు వాహనాన్ని పేల్చిన మావోయిస్టులు..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో పోలీసు వాహనాన్ని మావోయిస్టులు పేల్చారు. సోమన్‌పల్లి-రాణిబొడ్డి మధ్య గన్నం నాలా వద్ద ఐఇడి పేలుడు చోటుచేసుకుంది. వాహనం ముందుభాగం పేలుడు సంభవించడంతో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వారు స్వల్పంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు పాల్పడిన మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Spread the love