- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని రామడుగు గ్రామములోని పలు ప్రాంతాల్లు ప్రజలకు త్రాగు నీటిని అందించేందుకు గ్రామ సర్పంచ్ పార్వతి రమేష్ బుధవారం చెర్యలు చేపట్టారు. ఈసందర్బంగా అయన గ్రామములోని మసీదు వద్ద అలాగే ఆలయం వద్ద రెండు సింగిల్ ఫెజ్ మోటార్లను కొత్తవి అమార్చి నీటి సమస్యలు పరిష్కరించారు. అలాగే కుమ్మరి ప్రాంతంలోని మంచినీటి ట్యాంక్ లోకి సరఫరా కు మరమ్మత్తులు చేపట్టారు. ఇతర ప్రాంతల్లో నీటి సమస్య లేకుండా ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కార్యక్రమములో ఎంపిఓ శ్రీనివాస్, కార్యదర్శి అశోక్, ఉపసర్పంచ్ లోలం రాజేశ్వర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



