నవతెలంగాణ-మద్నూర్
ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాయంలో విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కు ధీటుగా విద్యాభివృద్ధిలో ముందుకెళ్లేందుకు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తుందని మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామ సర్పంచ్ కుమారుడు, ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దత్తు నాయకులు గంగారం తెలిపారు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులు, పాఠ్యపుస్తకాలు, టిఫిన్లు, భోజనాలు, అందించి విద్యాభివృద్ధికి పాటుపడుతుందని తెలిపారు. అంతపూర్ గ్రామంలోని పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వారు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



