హైదరాబాద్ : తెలంగాణ చిన్నోడు అర్షద్ మహ్మద్ జిమ్నాస్టిక్స్లో సత్తా చాటాడు. ఆల్ ఇండియా సీబీఎస్ఈ జాతీయ చాంపియన్షిప్స్లో హైదరాబాద్కు చెందిన అర్షద్ మహ్మద్ కాంస్య పతకం సాధించాడు. అండర్-11 బార్సు టేబుల్ వాల్ట్ విభాగంలో అర్షద్ మూడో స్థానంలో నిలిచాడు. అనుభవ్ సింగ్ (ఉత్తరప్రదేశ్), దేవాన్షు (మహారాష్ట్ర)లు వరుసగా 10.60, 10.05తో పసిడి, రజతాలు నెగ్గగా.. అర్షద్ 9.90 స్కోరుతో బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు. జాతీయ స్థాయిలో మెరిసిన అర్షద్ను అతడి కోచ్ హేమంత్ అభినందించారు.