భూ నిర్వాసితుల ఆవేదన “వలస” లఘు చిత్రం

నవతెలంగాణ-తొగుట : భూ నిర్వాసితుల ఆవేదన తెలిపేదే “వలస” లఘు చిత్రం కథ నాయకుడుగా నటించిన అలువాల కిష్టా గౌడ్ అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ హెచ్.అచ్యుత్ రెడ్డి నిర్మాత, దర్శ కత్వంలో యూ ట్యూబ్ ద్వారా “వలస” లఘు చిత్రం విడుదల అవుతుందన్నారు. ఈ చిత్రంలో
కాకతీయులు, నిజాం నవాబులు, బ్రిటిష్ ప్రభుత్వా ల నాటి నుండి నేటి వరకు ప్రస్తుత ప్రభుత్వలు దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టులు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అందు లో భాగంగా ఘతం గొలుసు కట్ట చెరువులు నిర్మించారు.  ప్రాజెక్టులు నిర్మించినప్పు డల్లా ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలు కష్టాలు వర్ణనాతీతం అన్నారు. ప్రజలు గ్రామాలు విడిచి వెళ్లే క్రమంలో కొందరు గుండె పగిలి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయ న్నారు. భూ నిర్వాసితుల బాధలని దృష్టిలో పెట్టు కొని తీసిన “లఘు చిత్రమే వలస” అని తెలిపారు. ఈ చిత్రం యొక్క దర్శక,నిర్మాత హనుమండ్ల కాడి అచ్యుత్ రెడ్డి అన్నారు.
Spread the love