తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

– హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు
నవతెలంగాణ-సుబేదారి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 2014 -2023 సందర్బంగా జూన్‌ 2వ తేదీ నుండి 22 వరకు జరిగే కార్యక్రమాలపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంద్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దశాబ్ది ఉత్సవాలపై సమీక్షించారు.. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, శాసన మండలి వైస్‌ చైర్మన్‌ బండా ప్రకాష్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినరు భాస్కర్‌, సీపీ ఏవి రంగనాథ్‌, హనుమకొండ జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌,వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ పి. ప్రావీణ్య,జెడ్పీ చైర్‌ పర్సన్‌ గండ్ర జ్యోతి, నగర మేయర్‌ గుండు సుధారాణి, శాసనసభ్యులు ఆరూరి రమేష్‌, నన్నపునేని నరేందర్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, చల్లా ధర్మా రెడ్డి, డాక్టర్‌ టి. రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ,అదనపు కలెక్టర్‌ లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love