కాంగ్రెస్ కండువా కప్పుకున్న మైనార్టీలు.

నవతెలంగాణ-గోవిందరావుపేట: మైనారిటీలకు ఇస్తా అని చెప్పిన 12% రిజర్వేషన్ ఏమైంది కెసిఆర్ మండలంలోని మైనారిటీలు అధిక సంఖ్యలో శుక్రవారం ఎమ్మెల్యే సీతక్క కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ మరియు క్లస్టర్ ఇన్చర్జీలు జెట్టి సోమయ్య, తేలహరి ప్రసాద్, పన్నాల ఎల్లారెడ్డి ల ఆధ్వర్యంలో వందలాదిగా మైనార్టీలు కాంగ్రెస్ పార్టీలో చేరి సీతక్క పై విశ్వాసాన్ని చాటుకున్నారు. ప్రధానంగా రాఘవపట్నం, గోవిందరావుపేట, చల్వాయి, పస్ర, బుస్సాపూర్ మొద్దులగూడెం గ్రామాల నుండి అధిక సంఖ్యలో మైనార్టీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.  రాఘవపట్నం గ్రామం నుండి షేక్ జాకీర్, షేక్ మంజూర్, షేక్ నేహా, షేక్ నసీమా, పఠాన్ ఇబ్రహీం, పఠాన్ ముజీబా, షేక్ సద్దాం, మహమ్మద్ పాషా, మహమ్మద్ ఫర్హాన, మహమ్మద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ ఫాతిమా భి, మహమ్మద్ మున్నా, మహమ్మద్ షరీఫ్, మహమ్మద్ సర్వర్, మహమ్మద్ రజాక్, మహమ్మద్ ఖాజా భి, మహమ్మద్ హలిమ భి, మహమ్మద్ ఆశా బేగం, మహమ్మద్ యాకూబ్ పాషా, మహమ్మద్ ఆజాం, మహమ్మద్ మన్సూర్, పస్రా గ్రామం నుండి మహమ్మద్ ఫాహీం, మహమ్మద్ ఫాయాజ్, మహమ్మద్ అంజాద్, మహమ్మద్ షఫీ, మహమ్మద్ శుకుర్, మహమ్మద్ ముజాహిద్, మహమ్మద్ ముజమ్మల్, మహమ్మద్ హజి బాబా, మహమ్మద్ ఇమామ్, షబ్బీర్, ఎండి.అంకూష్, ఎండి.హఫీజ్, ఎండి.నవాబ్, ఎండి.రషీద్, ఎండి.మాకూబ్, ఎండి.ఇసుజ గోవిందరావుపేట గ్రామం నుండి ఎండి.భోతిష వలి, ఎండి.శభాన, ఎస్కే.జహంగీర్, ఎస్కే.ఫకహాన, ఎండి.మహబూబ్ ఖాన్, ఎండి.అహ్మద్ భి, ఎండి.అజీజ్ ఖాన్, ఎండి.అసిఫా, ఎండి.యాకూబ్ పాషా, ఎండి.జుబేద బేగం చల్వాయి గ్రామం నుండి ఎండి.అయ్యుబ్, ఎండి.ఫర్ జాన, ఎస్కే.యాకూబ్ పాషా, ఎస్కే.నూర్ జహా, ఎండి.యాకూబ్ పాషా, ఎండి.ఫాతిమా, ఎండి.సలీం, ఎండి.మున్ని, ఎండి.యాకూబ్, ఎండి.సుల్తానా బుస్సాపూర్ గ్రామం నుండి ఎండి.పాషా, ఎండి.షబానా, ఎండి.తహిసీన్, ఎండి.నసీమ, ఎండి.అమీన్, ఎండి.సఖ్య, ఎండి.జయరామత్, ఎండి.షమీమ్, ఎండి.మున్నమ్మ మొద్దులగూడెం గ్రామం నుండి ఎస్కే.అక్బర్, ఎస్కే.కమ్రునిసా బేగం, ఎస్కే.బాబర్ తో సహా మొత్తం 70 మందికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి సీతక్క  ఆహ్వానించారు.ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రజా సమస్యల్లో నిత్యం పోరాటం చేస్తూ, ప్రజల కష్టాలను తీర్చాలని ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా అధికార పార్టీపై పోరాటం చేస్తూనే ఉన్నానని, నిత్యం ప్రజా కష్టాల్లో ప్రజలకు అండగా నిలబడి కరోనా కాలంలో, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు సహాయం అందిస్తూ, ములుగు ప్రాంత సమస్యలపై పోరాడుతూనే ఉన్నానని అన్నారు. ప్రతి క్షణం కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం శ్రమిస్తూ ఉన్నానని, అలాగే ఇప్పుడు అధికార పార్టీలో ఉండి అత్యున్నత పదవులు పొందిన కూడా ప్రజల కష్టాలను పట్టించుకోలేదని, ఇప్పుడు ఎన్నికల సమయం రాగానే ఓట్ల కోసం నాటకాలాడుతు మోసం చెయ్యడానికి వస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో కానీ, వరదల సమయంలో కానీ, వడ్ల కొనుగోలు విషయంలో కానీ ఏ రోజు ప్రజల్లోకి రాని నేతలు ఈ రోజు వచ్చి ఓట్ల కోసం డ్రామాలాడుతున్నారని అన్నారు. పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, గృహలక్ష్మి పథకం కోసం అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇవ్వాలని అన్నారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం గద్దెనెక్కి రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ ఉచిత నిర్భంద విద్య, దళితులకు 3ఎకరాల భూమి ఇస్తా అని, అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని నమ్మించి మోసం చేశారని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు పేదలకు చేరువయ్యాయని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరా జల ప్రభ ద్వారా బోర్లు, పంట రుణాలు, లక్ష రూపాయల రుణమాఫి, ఫీజ్ రీ ఇంబార్సుమెంట్, ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్, ప్రాజెక్టులు, కల్వర్టులు, పాఠశాలలు, కళాశాలలు అన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి విచ్చేసిన వారికి అందరికీ నా తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ రోజు వివిధ పార్టీల నుండి 50 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీ పోరాటాలలో భాగం అయినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.

Spread the love