రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం రంజాన్ వేడుకల్లో మాజీ మంత్రి, బాల్కొండ నియోజకవర్గ  ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఈద్గా వద్దకు వెళ్లి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.  అనంతరం మైనార్టీ సోదరులకు, చిన్నారులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Spread the love