లక్ష్మీపురం బొడ్రాయి ప్రతిష్టాపనలో ఎమ్మెల్యే సీతక్క

నవ తెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని లక్ష్మీపురం గ్రామ బొడ్రాయి ప్రతిష్టాపనలో గురువారం ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ భూదేవి శ్రీదేవి సహిత గ్రామ బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం గ్రామానికి ఎంతో మేలు చేస్తుందని సీతక్క అన్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని దేవతల ఆశీర్వాదాలు అందుకుని, అందరూ ఐకమత్యంగా ఉంటూ, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుకుంటున్న అని అన్నారు. అలాగే బొడ్రాయి మహా ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆలయ కమిటీకి 10,000/- రూపాయలు విరాళాన్ని అందించారు. అనంతరం గ్రామస్థులు సీతక్క ని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చింత క్రాంతి, తండా కృష్ణ, వాసం బాబు, జంపయ్య, కల్తీ సాంబయ్య, బుజ్జక్క, సారక్క, చిడెం బుచ్చక్క, యాదవ సంఘం నాయకులు, ఎస్టీ సంఘం నాయకులతో సహా గ్రామస్థులు అందరూ పాల్గొన్నారు.

Spread the love