వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా..

నవతెలంగాణ-హైదరాబాద్ : మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి మరొకరిని బరిలోకి దించడానికి వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్న వేళ బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, బాలశౌరి మచిలీపట్నం లేదా గుంటూరు టికెట్ ఆశించారు. కానీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో పార్టీకి గుడ్బై చెప్పారు. బాలశౌరి జనసేనలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Spread the love