మహిళా ఎమ్మెల్యేను అసభ్యకరంగా తాకిన ఎంపీ

నవతెలంగాణ -ఉత్తరప్రదేశ్‌: ఓ మహిళా ఎమ్మెల్యేను ఎంపీ అభ్యంతరకరంగా తాకిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎంపీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ జిల్లా కోల్ ప్రాంతంలో పండిట్ దీన్‌ దయాళ్ ఉపాధ్యాయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన వెలుగు చూసింది. కోల్ ఎమ్మెల్యే అనీల్ పరాశర్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దయాశంకర్ సింగ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్, మాజీ మేయర్ శకుంతల భారతీ, బీజేపీ కార్యనిర్వహక సభ్యురాలు పూనమ్ బజాజ్, జిల్లా పంచాయతి ప్రెసిడెంట్ విజయ్ సింగ్ వేదికపై కూర్చున్నారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న బీజేపీ ఎంపీ సతీశ్ గౌతమ్ తన పక్కనే కూర్చున్న మహిళా ఎమ్మెల్యే భూజాల చుట్టూ చేతులేసి ఆమెను కదిపారు. దీంతో ఎమ్మెల్యే ఇబ్బందిగా ఫీలైయ్యారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే ఠాకూర్ జైవీర్ సింగ్ ఇదంతా గమనించినట్టు కూడా కెమెరాల్లో చిక్కింది. ఎంపీ చర్యలతో ఇబ్బంది పడ్డ మహిళా ఎమ్మెల్యే ఆ తరువాత ఎంపీకి దూరంగా వెళ్లి మరో సీటులో కూర్చున్నారు.

Spread the love