అభివృద్ధి పనులకు తీర్మానం చేసిన ఎంపీపీ

నవతెలంగాణ- నిజాంసాగర్
మండల కేంద్రంలోని ఎంపీపీ చాంబర్లో వివిధ అభివృద్ధి పనులకు తీర్మానం చేసినట్టు ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గ రెడ్డి గారు తెలిపారు. జక్కాపూర్ లో బోరు మోటర్, ఆరేపల్లిలో బీసీ కమ్యూనిటీ హాల్, మంగళూరు నర్సింగ్ రావు పల్లి లో నీటి సమస్య కై పైప్ లైన్ ఏర్పాటు, వడ్డేపల్లి లో ఐమాక్స్ లైట్, శనివార్ పేటలో మురికి కాలువ ఏర్పాటు అలాగే అచ్చంపేటలో మురికి కాలువ ఏర్పాటుకై ఎంపీపీ అధ్యక్షతన సమావేశం చేశారని ఆమె తెలిపారు ఈ పనులన్నిటికీ  ఎంపీటీసీలు అందర్ తీర్మానం చేసినట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ నాగేశ్వర్ నిజం సాగర్ విద్యుత్ శాఖ ఏఈ వివిధ శాఖల అధికారులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Spread the love