న్యూఢిల్లీ : ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) నూతన ఛైర్మెన్గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో మాటమ్ వెంకట రావు నియమితులయ్యారు. గురువారం జరిగిన ఐబీఏ మేనేజింగ్ కమిటీలో ఆయన్ను ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మెన్ దినేష్ కుమార్, ఇండియన్ బ్యాంక్ ఎండీ ఎస్ఎల్ జైన్, సిటీ యూనియన్ బ్యాంక్ ఎండీ ఎన్ కామకొడి ఉన్నారు. అదే విధంగా బ్యాంక్ ఆఫ్ బహ్రాన్ అండ్ కువైట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, కంట్రీ హెడ్ను అసోసియేషన్ గౌరవ సెక్రెటరీగా ఎన్నుకున్నారు.