అమిత్ షా కలిసిన నారా లోకేశ్

నవతెలంగాణ – ఢిల్లీ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ కక్షసాధింపు చర్యలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తమని వేధిస్తున్న జగన్ కక్ష సాధింపు తీరును వివరించారు. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దీంతో అమిత్ షా..చంద్రబాబు, లోకేశ్‌పై ప్రభుత్వం పెట్టిన కేసుల గురించి వాకబు చేశారు.  ఈ క్రమంలో లోకేశ్.. జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ట్రైల్ కోర్టు, హై కోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి హోం మంత్రికి వివరించారు. 73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్యం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని పేర్కొన్నారు. కాగా, ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

Spread the love