అరాచక సర్కారుపై జనజైత్రయాత్ర

– నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర
– 100 రోజుల వేడుకలు
నవతెలంగాణ-హైదరాబాద్‌
యువగళం పాదయాత్ర అరాచక సర్కారుపై జనజైత్రయాత్రగా చరిత్రలో నిలిచిపోతుందని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం వందరోజులు పూర్తయిన నేపథ్యంలో పాదయాత్ర విశేషాలతో టీడీపీ నేత కేశినేని శివనాథ్‌(చిన్ని) ప్రత్యేక సంచిక తీసుకొచ్చారు. శ్రీశైలం నియోజకవర్గం బోయరేవుల క్యాంప్‌ సైట్‌ వద్ద సోమవారం యువనేత నారా లోకేష్‌ ‘ జనహదయమై నారా లోకేష్‌’ పేరుతో తెచ్చిన ప్రత్యేక సంచికను టీడీపీ తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాసాని కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్‌, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి , శ్రీశైలం నియోజకవర్గం ఇన్‌ఛార్జీ బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, దూండి రాకేష్‌, యువగళం మీడియా కో ఆర్డినేటర్‌ బీవీ. వెంకట రాముడు, తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జైరాం చందర్‌, తెలుగు మహిళా తెలంగాణ అధ్యక్షురాలు బి.షకీలా రెడ్డి, తెలంగాణ రాష్ట్ర యువ నాయకులు కాసాని వీరేశ్‌, టీటీడీపీ మీడియా కో-ఆర్డినేటర్‌ బియ్యని సురేష్‌, భాష్యం ప్రవీణ్‌, ఇతర నేతలు పాల్గొన్నారు.

Spread the love