కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి భేటీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్‌అహూజా సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్‌ 15-17తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న జీ-20 అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు ముందస్తు ఏర్పాట్ల సమీక్ష కోసం వచ్చిన మనోజ్‌ అహూజా, జాయింట్‌ సెక్రటరీ యోగితారాణాలను సీఎస్‌ శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, పెద్ద ఎత్తున పెరిగిన వ్యవసాయోత్పత్తుల తదితర వివరాలను మనోజ్‌ అహూజాకు శాంతికుమారి వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు పాల్గొన్నారు.

Spread the love