రంజాన్ సరుకులు అందజేసిన నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని పోసానిపేటలో మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముస్లిం కుటుంబాలతో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పచ్చడి పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని ముస్లిం కుటుంబాలకు వచ్చే రంజాన్ పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి కుటుంబానికి పండగ సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ముస్లింలు మాట్లాడుతూ..గ్రామంలో కులమతాలకు అతీతంగా పండగలు నిర్వహించుకుంటామని, పండగ సరుకులను అందజేసినందుకు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ముస్లిం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love