- Advertisement -
బీజింగ్ : నేపాల్ మంత్రి షిశిర్ ఖనల్ ఆదివారం చైనా రాజధాని బీజింగ్ చేరుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో నేపాల్లో జరిగిన ఎన్నికలలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) ఘన విజయం సాధించిన నేపథ్యంలో చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను పెంచుకునే ఉద్దేశంతో ఆయన బీజింగ్ పర్యటనకు వచ్చారు. చైనా పర్యటనకు ముందు ఖనల్ భారత్లో పర్యటించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల చైనా పర్యటనలో భాగంగా ఆయన చైనా ఆర్థిక మంత్రి వాంగ్ యీతో సమావేశమవుతారు. చైనా ఉన్నత స్థాయి అధికారులతో కూడా చర్చలు జరుపుతారు.
- Advertisement -



