తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు

నవతెలంగాణ – తమిళనాడు: తమిళనాడులో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హిజ్బుత్ తహ్రీర్ కేసులో భాగంగా రాష్ట్రంలోని 10 చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా దేశంలో షరియా చట్టం అమలుకు కుట్ర పన్నిన హిజ్బుత్ తహ్రీర్ అనే సంస్థ అమాయక ముస్లిం యువకులను ఆకర్షించి ఇస్లామిక్ రాడికల్స్‌గా మారుస్తున్నట్టు ఇదివరకే ఎన్ఐఏ అధికారులు తమ అభియోగపత్రంలో పేర్కొన్నారు.
Spread the love