నవతెలంగాణ డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల పరిధిలోని పరీక్షల నోటిఫికేషన్ ను శుక్రవారం యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ విడుదల చేశారు. బి ఏ /బీకాం/ బిఎస్సి /బి బి ఏ కోర్సులకు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యులర్ మరియు రెండవ, నాలుగవ, ఆరవ, సెమిస్టర్ బ్లాక్ లాగ్ పరీక్షలకు 2019 నుండి డిసెంబర్2023 వరకు అర్హులైన విద్యార్థులకు మాత్రమే నని తెలిపారు. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఈనెల 21 వరకు ఉందని, 100 రూపాయల అపరాధ రుసుముతో 22 వరకు చెల్లించాల్సి ఉటుందని పరీక్షల నియంత్రణా ధికారిని ప్రోఫేసర్ డాక్టర్ ఎం అరుణ వివరించారు. పూర్తి వివరాలు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అమె కోరారు.