ఘోర రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి 9 మందికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ – హైదరాబాద్: ఘోర రోడ్డు ప్రమాదం కోదాడ జాతీయ రహదారి 65 మునగాల మండలం ఆకుపాముల సమీపంలో ఆటోను ఓ కారు ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న 10 మందిలో ఒకరు స్పాట్ లోనే చనిపోయారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే  వారిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు బాధితులకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.  శుభకార్యానికి హాజరై తిరిగి ఆటోలో స్వగ్రామానికి వెళ్తుండగా వెనుక నుండి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు.

Spread the love