తుంగభద్ర డ్యామ్‌కు లక్ష క్యూసెక్కుల వరద…

Tungabhadra-Damనవతెలంగాణ – హైదరాబాద్
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఉత్తర, దక్షిణ కన్నడ ప్రాంతాల నుంచి తుంగభద్ర జలశయానికి లక్ష క్యూసెక్కుల వరద చేరుతోంది. బుధవారం డ్యాంలోకి 1,08,019 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో 198 క్యూసెక్కులు నమోదైంది. డ్యాంలో గరిష్ట నీటి నిల్వ 105.788 సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం 40.136 టీఎంసీ నీటిమట్టం ఉంటుంది. డ్యామ్‌లో 1633 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గానూ 1611.27 నీటిమట్టం ఉన్నట్లు డ్యామ్‌ సెక్షన్‌ అధికారి రాఘవేంద్రరావు తెలిపారు. ఎగువ నుంచి వరద మరింత పెరిగే సూచనలు ఉన్నాయని, ఈ నెల చివరి నాటికి తుంగభద్ర డ్యాం నిండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. టీబీ డ్యాంకు ఆశించిన మేరకు వరద చేరుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Spread the love