నవతెలంగాణ – హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తోంది. నేరేడ్మెట్, కుత్బుల్లాపూర్, సైదాబాద్, ముషిరాబాద్, వనస్థలిపురం తదితర చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. వర్షం ధాటికి రోడ్లపై నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.