నవతెలంగాణ – హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఓ వైపు ఆటను ఆస్వాదిస్తుంటే.. ‘సందట్లో సడేమియా’లా దొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఐపీఎల్ నేపథ్యంలో ఉప్పల్లో క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా వీక్షకుల ఫోన్లు పెద్దఎత్తున పోయాయి. వేలాది మంది మధ్య సాధారణ అభిమానుల్లా దూరిపోతున్న కేటుగాళ్లు ఫోన్లు ఇట్టే మాయం చేస్తున్నారు. సగటున ఒక్కో రోజు 20 – 40 మధ్య ఫోన్లు గాయబ్ అయ్యాయి. కొందరు ఆటపై దృష్టితో స్టేడియంలో చేజార్చుకుంటున్నారు. ఇంకొందరు దొంగలకు సమర్పించుకున్నారు. మ్యాచ్ ముగిశాక విషయం తెలుసుకుని కంగుతింటున్నారు.