ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా .. ఒకరు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని నార్సింగి వద్ద ఓఆర్‌ఆర్‌పై ఆదివారం రాత్రి ఒక ప్రయివేటు బస్సు బోల్తా పడి.. ఒకరు మృతి చెందగా 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మద్యం మత్తులో డ్రైవర్‌ మితిమీరిన వేగంతో బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని నార్సింగి పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒంగోలుకు చెందిన మమత (33) బస్సు కింద నలిగిపోయి ప్రాణాలు విడిచారు. గాయపడిన ఇతర ప్రయాణికులను చికిత్స కోసం నానక్‌రాంగూడలోని కాంటినెంటల్‌ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని మద్యం మత్తు పరీక్ష నిర్వహించగా 197 వచ్చినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ అతిగా మద్యం తాగినట్లు అర్థమవుతోంది.

Spread the love