వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

Accidentనవతెలంగాణ – వరంగల్
గీసుగొండ మండలం మచ్చాపురం గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులు ఎడ్ల బండిని ఢీకొట్టారు. దీంతో తీవ్రమైన గాయాలు కావడంతో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సిఐ ఎల్. పవన్ కుమార్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించామని, మృతుల పూర్తి వివరాలు గురించి విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు.

Spread the love