ప్రజా సమస్యలు తెలుసుకొని పరిస్కారం చేయడానికే పాదయాత్ర

Padayatra is to know and solve public problems– ప్రజా ఆశీర్వాద యాత్రలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి…పుట్ట మధూకర్‌
నవ తెలంగాణ మల్హర్ రావు.
మంథని నియోజకవర్గ ప్రజా సమస్యలను, కష్టాలను తెలుసుకొని తక్షణమే పరిస్కారం చేయడానికే ప్రజా ఆశీర్వాద యాత్రను ప్రారంభించినట్లుగా మంథని బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, పేద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ అన్నారు.మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్ల నుంచి పెద్దతూoడ్ల మీదుగా కొయ్యుర్ వరకు ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు వారసత్వ రాజకీయాలు లేకుండా ఓ పేద బిడ్డ రాజకీయంగా ఎదిగితే ఓర్వేలేక పోతున్నారని,15ఏండ్లుగా మంథని నియోజకవర్గంలోని పేద ప్రజలకు అండగా నిలిచి అదుకుంటే కొందరు నిందారోపణలు చేస్తున్నారని ఆరోపించారు.హైదరాబాద్‌ కేంద్రంగా తనపై కుట్రలు,కుతంత్రాలకు తెరలేపుతున్నారని, కుల సంఘాలు, మీడియా సంస్థలు పని గట్టుకుని తనను బదనాం చేస్తున్నాయన్నారు.2014లో ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేను చేస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు.మానేరుపై బ్రిడ్జి,పెద్దతూoడ్ల,షాత్రాజ్ పల్లి బ్రిడ్జిలు,సిసి రోడ్లు,కిషన్ రావు పల్లి నుంచి భూపాలపల్లి వరకు రోడ్డు కోసం అటవీశాఖ నుంచి అనుమతులు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టు మండలాన్ని అభివృధ్ది పధంలో ముందుకు నడిపించనన్నారు.ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు కాగితాలను పంచుతున్నారని,ఐదేండ్ల కాలంలో అభివృధ్ది పనులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.ఓట్లు వస్తేనే కాంగ్రెస్సోళ్లకు ప్రజలు గుర్తుకు వస్తారన్నారు.తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంథని ప్రాంతంలోని ప్రతిపేద బిడ్డకు రూపాయి ఖర్చు లేకుండా ఉన్నత చదువుల బాధ్యత తనదేనని ఆయన ఈ సందర్బంగా ప్రకటించారు. 2014లో మంథని నియోజకవర్గానికి వెలుగులు వచ్చినట్లే వచ్చి మళ్లీ పోయాయని,ఈ సారి ప్రజల ఆశీర్వాదంతో మంథని ప్రాంతానికి వెలుగులు రావాలని, శాశ్వతంగా ఉండాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా భూపాలపల్లి జెడ్పి చైర్మన్ జక్కు శ్రీహర్షిని మాట్లాడుతూ అభివృధ్ది, సంక్షేమం వైపు అడుగులు వేసే నాయకుడు పుట్ట మధన్నారు. ప్రజా క్షేత్రంలో నిరంతరం ఉంటే మన బిడ్డల భవిష్యత్‌ కోసం ఆలోచన చేసే నాయకుడిని కాపాడుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love