నవతెలంగాణ -హైదరాబాద్ : పొట్టి ప్రపంచకప్ తొలి మ్యాచ్లో పాకిస్థాన్ ఆతిథ్య అమెరికాను ఢీకొంటోంది. డల్లాస్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన యూఎస్ఏ సారథి మొనాక్ పటేల్ బౌలింగ్ తీసుకున్నాడు. ఆరంభ పోరులో కెనడాపై రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన యూఎస్ఏ రెండో విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు గత సీజన్ రన్నరప్ బాబార్ ఆజాం సేన గెలుపుతో టోర్నీని ఘనంగా ఆరంభించాలనే పట్టుదలతో ఉంది.
పాకిస్థాన్ తుది జట్టు : బాబర్ ఆజాం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, అజాం ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, నసీం షా, మహ్మద్ అమిర్, హ్యారిస్ రవుఫ్.
యూఎస్ఏ తుది జట్టు : స్టీఫెన్ టేలర్, మొనాక్ పటేల్(కెప్టెన్, వికెట్ కీపర్), అండ్రిస్ గౌస్, అరోన్ జోన్స్, నితిశ్ కుమార్, కొరే అండర్సన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, నొస్తుశ్ కెంజిగే, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్.