సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

నవతెలంగాణ – మోర్తాడ్
మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి బుధవారం పాలాభిషేకాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకుగాను సంఘ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ పాలభిషేకాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మున్నూరు కాపు సంఘ అభివృద్ధికి గాను కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, కార్పొరేషన్ ద్వారా సంఘం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మున్నూరు కాపు సంఘం కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చసిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ సభ్యులతో పాటు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love