![](https://navatelangana.com/wp-content/uploads/2023/11/Screenshot_20231116-184507_WhatsApp.jpg)
నవతెలంగాణ- మల్హర్ రావు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గురువారం పాలకుర్తి మండలంలో ప్రచారం చేపట్టిన ఆయన కన్నాల గ్రామంలో గౌడ కులస్తుల విజ్ఞప్తి మేరకు కాసేపు సేద తీరి తాటి కల్లు సేవించారు. రాష్ట్రంలోని గౌడ కుల వృత్తిని కాపాడుకునే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని, తాటి ఈత కల్లు సేవించడం ఆరోగ్యానికి ఎంతో మంచిదనే సందేశం ఇస్తూ నీరా హబ్లను సైతం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గీతా కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే కులవృత్తులకు ప్రోత్సహం లబిస్తోందని ఆయన అన్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో బాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ తాటికల్లు సేవించడం పట్ల గీతాకార్మికులు, గౌడ కులస్తులు హర్షం వ్యక్తం చేశారు.